Thursday, March 28, 2024

ఏపీ సర్కారుకు భూములను తిరిగిచ్చేసిన రిలయన్స్

గతంలో ఏపీ ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు తిరుపతి సమీపంలో భూములను ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం చంద్రబాబు హయాంలోని స‌ర్కారు 136 ఎకరాలను కేటాయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అందులో 75 ఎకరాలను అప్పగించింది. అయితే రిలయన్స్‌ సంస్థకు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు ప‌లు కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉండక‌పోవ‌డంతో రిల‌య‌న్స్ ఆ భూముల‌ను తిరిగి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు వెనక్కి ఇచ్చేస్తూ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇది కూడా చదవండి: ఫిక్సుడ్ డిపాజిట్.. ఏ బ్యాంకులో బెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement