Saturday, April 20, 2024

సీతమ్మ చెంతన శిలువ..!

గుంటూరు జిల్లా యడ్లపాడులో సీతమ్మ తల్లి పాదాలున్న ప్రదేశాన్ని హిందూవులు పవిత్ర స్థలంగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతంలో తాజాగా ఓ భారీ శిలువను ప్రతిష్టిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై పలువురు బీజేపీ నేతలు స్పందించి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. సీతమ్మతల్లి పాదముద్రలు ఉన్న చోట ఓ భారీ అక్రమ నిర్మాణం జరుగుతోందని, ఇదంతా జగన్ ప్రభుత్వం మద్దతుతోనే జరుగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. ఏపీలో హిందూవులకు సంబంధించిన నిర్మాణాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం హిందూవులకు బాసటగా నిలవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు హిందూవులకు పరమ పవిత్రంగా ఉన్న స్థలాన్ని మతమార్పిడి మాఫియా ఆక్రమించిందని, ఈ స్థలంలో అక్రమంగా శిలువను ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి గరం గరం అయ్యారు. జగన్ పాలనలో ఏపీలో హిందూవులకు చోటు లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వరుసగా హిందూవుల ఆలయాలపై దాడులు జరగడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ఘటనపై ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంఛార్జి సునీల్ దేవ్‌ధర్ సైతం స్పందించారు. గుంటూరు జిల్లాలో క్రైస్తవ మాఫియా రెచ్చిపోతుందని, ఇలాంటి ఘటనలపై తాము నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకుండా క్రైస్తవ మతానికి చెందిన వారికే మద్దతు పలుకుతోందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement