Saturday, April 20, 2024

ఎన్ కౌంట‌ర్ లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

ఎన్ కౌంట‌ర్ లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మైన ఘ‌ట‌న జ‌మ్ముక‌శ్మీర్ లో చోటుచేసుకుంది. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కస్బయార్‌ ప్రాంతంలో ఈరోజు ఉద‌యం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముష్కరులకోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టగా… గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జ‌ర‌ప‌డంతో.. కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మృతిచెందినవారిని జైషే మహమ్మద్‌ టాప్‌ కమాండర్‌ యాసిర్‌, ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ అయిన విదేశీ ఉగ్రవాది ఫర్క్వాన్‌గా గుర్తించిన‌ట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement