Thursday, March 28, 2024

అహ్మదాబాద్ : ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు డౌన్

అహ్మదాబాద్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ ను కెప్టెన్ కోహ్లీ అక్షర్ పటేల్ చేత వేయించాడు. తొలి బంతికే అక్షర్ పటేల్  క్రావ్లేను క్లీన్ బౌల్డ్ చేశారు. అదే ఓవర్ లో అక్షర్ పటేల్ బ్రెయిన్ స్ట్రోను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ డకౌట్ అయ్యి బ్రెయిన్ స్ట్రో పెయిర్ సాధించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకూ నాలుగు ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement