Thursday, April 18, 2024

అహ్మదాబాద్‌: టి20లకు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక

అహ్మదాబాద్‌: భారత్‌తో జరిగే 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టును ఈసీబీ ప్రకటించింది. 16మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నారు. మార్చి 12 నుంచి 20వరకు ఈ సిరీస్‌ జరగనుంది. టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్న డేవిడ్‌ మలన్‌ కూడా ఈ సిరీస్‌లో ఆడనున్నాడు. అయితే స్టార్‌ పేసర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌కు టీ20 జట్టులో స్థానం లభించలేదు. ఈసీబీ ప్రకటించిన టీ20జట్టులో ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, సామ్‌ కరన్‌, డేవిడ్‌ మలన్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, బెన్‌స్టోక్స్‌,రీసీ టోప్లీ, మార్క్‌వుడ్‌, క్రిస్‌ జోర్డాన్‌తోపాటు 27ఏళ్ల లియమ్‌ లివిం గ్‌స్టోన్‌కు అవకాశం లభించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్‌ మొత్తం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఇంగ్లండ్‌ జట్టు టీ20 సిరీస్‌ కోసం అహ్మదాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement