Thursday, April 18, 2024

అమ్మాయిలను కట్టి పడేస్తున్నారు: చిన్మయ మరోసారి ఫైర్

మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీపై రియాక్ట్ అవుతూ మీటూ ఉద్యమ సమయంలో ధైర్యంగా మాట్లాడి బడా బాబుల చీకటి కోణాలు బయటపెట్టింది గాయని చిన్మయ….మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఓ సగటు అమ్మాయి పంపిన ఓ మెసేజ్‌పై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయింది.  తాజాగా ఓ అమ్మాయి తనతో చెప్పిన కొన్ని విషయాలను అందరి ముందుంచుతూ ఈ నీచమైన సమాజంలో మార్పు రావాలంటూ ఘాటుగా స్పందించింది. సొంత పేరెంట్సే తనను వేశ్యగా చూస్తున్నారని, అసభ్యపదజాలంతో తిడుతున్నారని ఓ యువతి చిన్మయికి సందేశం పంపింది. ఆరోగ్య పరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల పీరియడ్స్‌ని బ్రేక్ చేసినా దాన్ని మరోలా అర్థం చేసుకొని ఎవడితో పోవడానికి ఇలా చేశావ్ అని తన తల్లి బ్లేమ్ చేస్తోందంటూ సదరు యువతి ఆవేదన చెందింది.

ఆ యువతికి అండగా నిలిచిన చిన్మయ కచ్చితంగా ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిందే. ఇలాంటి ఘటనల వల్ల మనకు మన శరీరమన్నా, సెక్స్ అన్నా, రొమాన్స్ అన్నా చిరాకు వచ్చేస్తోంది. సాధారణ అమ్మాయిలమైన మనల్ని ఇంట్లోవాళ్లే ఇలా నిందించడం సరైనదేనా?” అని ప్రశ్నించింది. అలా చేయడం తప్పని మీకే తెలుస్తోంది. మాతా, పిత, గురు దైవం అనే చెప్పే మాటల్లోనే అంతా దాగి ఉంది. అలా చెప్పి వారిని గొప్పవారిగా చిత్రీకరించి అమ్మాయిలను మాత్రం కట్టి పడేస్తున్నారు. అది మహిళల కర్మ అయిపోయింది. మరీ దారుణం. ఇలాంటి వాతావరణంలో భర్తను ఎంచుకోవడంలో అయినా చాలా జాగ్రత్త తీసుకోండి. అప్పుడైనా కొంత ఉపశమనం లభిస్తుంది అని చిన్మయి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement