Thursday, April 25, 2024

అమరావతి : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం : మంత్రి బొత్స

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే విశాఖ ఉక్కు ఒక్క విశాఖకు మాత్రమే చెందింది కాదని అన్న ఆయన రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విశాఖ విషయంలో ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిన విశాఖను ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ ప్రైవేటీకరణకు అడ్డుకుంటామని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement