Saturday, April 20, 2024

అనంతపురం : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారు.  కారు… గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న్నది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  మృతుల వివరాలు:(1)రేఖ(21)కిషన్ గంజ్ నార్త్ దిల్లీ, (2)ఆంచల్ సింగ్(21), 3)మహబూబ్ఆలం(31)ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు (4)మనోజ్ మిట్టల్ (38)ప్లాటినంసిటీ, నార్త్ బెంగళూరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement