Thursday, March 28, 2024

చమురు బంధం చెక్కుచెదరదు

ఆపద సమయంలో రష్యా మన దేశానికి అండగా నిలవడం కొత్తకాదు. గతంలో ఎన్నో సందర్భాల్లో రష్యా మనకు అండగా నిలిచింది. తాజాగా రష్యా విక్రయించే చమురు ధరలపై జి-7 దేశాలు ఆంక్షలు విధించడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. దీనిపై రష్యా హర్షం వ్యక్తం చేస్తూ చౌక ధరలో చమురు కొనుగోళ్ళను కొనసాగించేందుకు భారీ సామర్ధ్యం ఉన్న ఓడల నిర్మాణం, లీజుల విషయంలో భారత్‌కి సహకరిస్తామని ముందుకు వచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యా చమురు విక్రయాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్‌) దేశాలుచమురు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు సుముఖంగా లేవు. దీంతోధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపధ్యంలో భారత్‌ వంటి చిరకాల మైత్రిగల దేశాలకు చమురును విక్రయించేందుకు రష్యా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశాన్ని గతంలో రష్యా ఆదుకుంది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోరాదని అమెరికామాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు విధించినప్పుడు ఆదుకుంది. అలాగే, గల్ఫ్‌ యుద్ధం సమయంలో కూడా మన దేశానికి రష్యా చమురు విషయంలో అండ గా నిలిచింది.

ఈ కారణంగానే ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా తో తెగతెంపులు చేసుకోవాలని అమెరికా, దాని మిత్ర దేశాలుఎంత ఒత్తిడి చేసినా మన దేశం తటస్థ వైఖరినే అనుసరించింది. రష్యాపై ఆంక్షల విషయంలోఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాలపై ఓటింగ్‌ విష యంలో తటస్థంగా వ్యవహరించింది.ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ మన దేశాన్ని సుతిమెత్తగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినా మన దేశం లెక్క చేయలేదు. రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో మన దేశం చమురు కొనుగోలు చేసింది. ప్రచ్చన్నయుద్ధం సమయంలో కూడా రష్యా, అమెరికాల మధ్య ఎన్ని తగా దాలున్నా, మన దేశానికి అవసరమైన ముడి చమురు, యుద్ధ సామగ్రి సరఫరా విషయంలో రష్యా ఉదారంగా నే వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కి శాశ్వత సభ్యత పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని రష్యా విదేశాం గ మంత్రి సెర్గీ లోవ్రోవ్‌ స్పష్టం చేశారు.గతంలో పెక్కు సార్లు ఈ విషయంలో రష్యా బాసటగా నిలిచింది. తాజా గా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాన్నిఉదహరిస్తూ ఎవరినీ రెచ్చకొట్టకుండా భారత్‌ సంయమనంతో వ్యవహరిస్తోందనీ, పెద్ద మనిషి తరహా లో సలహాలిస్తోందనీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో భార త్‌ పరిపక్వతకు ఇది నిదర్శనమని అన్నారు. అంతేకాక, భారత్‌ గతంలో జరిగిన యుద్ధాల సమయాల్లో కూడా ఇదే విధమైన సంయమన వైఖరిని అనుసరించిందని ఆయన అన్నారు. భద్రతా మండలిలో భారత్‌ వంటి పరిపక్వత గల దేశాలుంటే అసలు పరిస్థితులు యుద్ధాల వరకూ రానేరావు. భద్రతా మండలిలో తనకు గల సభ్య త్వాన్ని చైనా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ద్వారా దుర్వినియోగం చేసుకుంటోంది. చమురు వాణిజ్యం విషయంలో కూడా అమెరికా అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంలో భారత్‌ ఎంతో సంయమనంతో వ్యవ హరిస్తోంది. అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్లనే ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తామని ప్రకటించా యి. చమురు నిల్వలను వీలైనంత ఎక్కువ సేకరించి అధిక ధరకు అమ్ముకోవడం అమెరికాకు మొదటి నుంచి అలవాటు.ఈ విషయంలో చాలా కాలంగా అమెరికాను వర్ధమాన దేశాలు విమర్శిస్తున్నాయి. అయితే, ఒపెక్‌ దేశాల్లో అతి సంపన్న దేశమైన సౌదీ అరేబియాతో అమెరికా మైత్రిని కొనసాగిస్తూ తన అవసరాలమేరకు చమురును సేకరిస్తోంది. అభివృద్ధి చెందుతున్న, వర్ధ మాన దేశాల ప్రయోజనాలను దెబ్బతీయడమే లక్ష్యం గా అమెరికా వ్యవహరిస్తోంది.జి-7 దేశాల నిర్ణయం వెనుక అమెరికా ఉంది.ఈ విషయం రష్యాకు తెలుసు. అందుకే, భారత్‌కి చమురు విషయంలో ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేస్తామని రష్యా ముందుకు వచ్చింది. మాస్కోలో భారత్‌ రాయబారి పవన్‌ కపూర్‌ ఇటీవల రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌తో సమా వేశమయ్యారు. జి-7 దేశాల నిర్ణయం ప్రస్తావనకు వచ్చి నప్పుడు కపూర్‌కి నోవాక్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. భారత్‌ని తమ దేశం ఆదుకుంటుందనీ,ఈ విషయంలో ఎటువంటి భయసందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. భారత్‌ ఉక్రెయిన్‌ విషయంలో అనుసరిస్తున్న వైఖరికి రష్యా ఏ మాత్రం కోపగించుకోలేదు సరికదా, ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో భారత్‌ అనుసరిస్తున్న వైఖరి సరైనదేమోననిపిస్తున్నదని అన్నారు. చమురు విష యంలో దేశాల మధ్య దూరం పెరగరాదన్నదే తమ విధానమని పవన్‌ కపూర్‌ స్పష్టం చేశారు.భారత్‌కి ఢోకా లేకుండా చముు సరఫరా జరిగేట్టు చూస్తానన్న హామీని రష్యా ఉపప్రధాని నోవక్‌ నుంచి ఆయన పొందగలిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మేలు చేసే అంశమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement