Thursday, April 25, 2024

Yadagirigutta: యాదాద్రికి పోటెత్తిన భక్తులు 

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో యాదాద్రికి సంద‌ర్శ‌కుల తాకిడి పెరిగింది. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు క్యూలో వేచిఉన్నారు. ఉచిత దర్శననాకి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం ప‌ట్ట‌నుంద‌ని అధికారులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉద‌యం నుంచే భ‌క్తులు అధిక సంఖ్య‌లో రావ‌డంతో క్యూ లైన్లు ఆలయ తిరువీధులు నిండిపోయాయి. అదేవిధంగా కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌క్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement