Thursday, April 18, 2024

వెూక్షానికి సులభ మార్గం విష్ణు సహస్రనామ పారాయణం

శ్రీమహావిష్ణు దేవతలందరిలో ఉత్తమోతమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహ మ్ము వలదు.. చక్రీ సర్వోపగతుండు. ఆ దేవాది దేవు డి నుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం జపం చేసి నట్టయితే.. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టం కలుగుతుంది. రాజ యోగం ప్రాప్తిస్తుంది. పితృదోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్య్ర ఈతిబాధలు కనుమరుగవుతాయి. ప్రతిరోజు సంధ్యాకాలంలో విష్ణు సహస్రనామం ఇంట్లో ధ్వనిస్తే అప్పులు తీరిపోతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది.
జ్ణానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహావిష్ణు ఆరాధన. ఏవ రైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయణం గావిస్తా రో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుం ది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయ ణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మాన సిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణంవల్ల నవగ్రహ దోషా లు తొలగి, వాక్సుద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి అవుతుంది. తద్వా రా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది.
– కామిడి సతీశ్‌ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement