Thursday, March 28, 2024

విశేష ఫలప్రదం అమలిక ఏకాదశి వ్రతం

హిం దూమతంలో అమలక లేదా అమలిక ఏకా దశి ప్రత్యేక స్థానం ఉంది. హిందూ పంచాం గం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి రోజున అమలక ఏకాదశి పండుగ జరుపుకుంటారు. ఒక సంవత్సరంలో దాదాపు 24 నుండి 26 ఏకాదశిలు ఉన్నాయి. ప్రతి ఏకాదశి దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి వుంటుంది. శ్రీమహా విష్ణువు చర్యలను బట్టి శయన ఏకాదశి, పరివర్తన ఏకా దశి, ప్రబోధినేకాదశి, ప్రవత నియమాలను బట్టి నిర్జల ఏకాదశి, ఫల ఏకాదశి ఏర్పడ్డాయి. అయితే ఒక పండు (ఉసిరిక) నామంతో ఏర్పడినది మాత్రం అమలిక ఏకా దశి మాత్రమే. ఈ అమలిక ఏకాదశినే సాధారణ భాషలో ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు.
‘అమలక వృక్షే జనార్థన:’ అని అమదేర్‌ జ్యోతిషి మున్నగు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అమలక వృక్షం జనార్థన స్వరూపమని, దానికింద ఏకాదశి వ్రతాన్ని ఆచ రించాలని శాస్త్ర వచనం. స్మృతికౌస్తుభం, కృత్యసార, సముచ్ఛయం, తిధి తత్వం మొదలైన గ్రంథాలు కార్తిక మాసంలో ఉసిరి( అమలక) వృక్షం కింద జనార్థనుడును పూజించాలని, ఉసిరికాయలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వా లని చెప్పారు. కార్తిక మాసంలో ఉసిరికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అదే విధంగా ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు.
ఉసిరిని హిందూ మతస్తులు ప్రత్యేకంగా పూజిస్తారు. ఉసిరి చెట్టు-లో విష్ణువు ఉంటాడని భావన. అమలిక ఏకాదశి వ్రతంతో సంబంధం ఉన్న పురా ణాలలో ఒకదాని ప్రకారం, బ్రహ్మదేవుని కన్నీళ్ల నుండి అమల చెట్టు- ఉద్భ వించింది. విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు తరువాత, తన ను ఎవరు సృష్టించారు, తన జన్మ వృత్తాంతం తెలుసుకోవాలని తీవ్ర తప స్సు చేశాడు. అప్పుడు విష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను సృష్టించిన కర్తను చూసిన వెంటనే, బ్రహ్మ దేవుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టు-కున్నాడు. బ్రహ్మదేవుని భక్తికి పొంగిపోయిన విష్ణువు కన్నీళ్లు అమల వృక్షాలుగా రూపాంతరం చెందుతాయని, ఈ చెట్ల ఫలాలు తనకు ప్రియమై నవని చెప్పాడు. ఫాల్గుణ శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు అమల వృక్షాన్ని పూజిం చేవారు తన అనుగ్రహాన్ని పొందుతారని చెప్పారు. అంతేకాదు ఈ రోజున ఉసిరిచెట్టు సమీపంలో లక్ష్మీదేవి, కుబేరుడు నివాసముంటారని ప్రతీతి. అలాగే హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున రాధాకృష్ణులు ఉసిరిచెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెబుతున్నాయి.
రెండవది ఆయుర్వేదంలో దాని లక్షణాల కారణంగా. సృష్టి కోసం విష్ణు వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చినప్పుడు, ఆ సమయంలో అతను ఉసిరి చెట్టు -కు కూడా జన్మనిచ్చాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున దేవుడిని ఉసిరి చెట్టు- కింద కూర్చోబెట్టి పూజిస్తారు. హిందువుల రంగుల పండుగ అయిన హోలీ ప్రధాన వేడుకను ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు.
ఉసిరి ఏకాదశి పూజ

స్నానం చేసి, విష్ణుమూర్తి ముందు నువ్వులు, కుశ, ముద్ర, నీరు తీసు కుని, విష్ణువుకు సుఖం, మోక్షం కలగాలని కోరుకుంటూ అమలకీ ఏకాదశి వ్రతం పాటిస్తానని సంకల్పిస్తారు. మతవిశ్వాశాలతో దేవుడిని పూజిస్తారు. దేవుడిని పూజించిన తర్వాత, పూజా సామగ్రితో ఉసిరి చెట్టు-ను పూజించాలి. ముందుగా చెట్టు- చుట్టూ ఉన్న భూమిని శుభ్రం చేసి ఆవు పేడతో పవిత్రం చేసి. చెట్టు- వేరులో ఒక బలిపీఠం చేసి దానిపై కలశం ప్రతిష్టిస్తారు. ఈ కలశంలో దేవతలు, తీర్థయాత్రలు, సముద్రాన్ని ఆహ్వానిస్తారు. కలశంలో సువాసన, పంచ రత్నాలను ఉంచి పంచ పల్లవి ఉంచి దీపం వెలిగిస్తారు.. శ్రీఖండ గం ధాన్ని కలశకు పూసి వస్త్రాలు ధరించి చివరగా కలశంపై శ్రీవిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. రాత్రి భాగవత కథ, భజన కీర్తనలు చేస్తూ భగవంతుని స్మరిస్తారు.
ద్వాదశి రోజున బ్రాహ్మణునికి అన్నదానం చేసి దక్షిణతో పాటు- పరశు రాముని విగ్రహంతో సహా కలశను సమర్పించి ఆ తరువాత ఆహారం తీసుకుంటారు. పశ్చిమ రాజస్థాన్‌లో ఉసిరి చెట్టు- లేకపోతే, మహిళలు ఖేజ్దీ చెట్టు-ను పూజిస్తారు.

  • ఆళవందార్‌ వేణు మాధవ్‌
    8686051752
Advertisement

తాజా వార్తలు

Advertisement