Friday, April 19, 2024

Vemulawada : రెండున్నరేళ్ల తర్వాత రాజరాజేశ్వర స్వామి ధర్మ గుండం పున:ప్రారంభం

రాజన్న సిరిసిల్ల : దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మ గుండాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్ల అనంతరం ధర్మగుండం ప్రారంభించారు. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం కోవిడ్ కారణంగా ధర్మగుండాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ నుండి ఆదేశాలు రావడంతో తిరిగి ఈరోజు ధర్మ గుండాన్ని ప్రారంభించారు. కమిషనర్ నుండి ఆదేశాలు రాగానే ఇటీవల ఇందులో పూడికలు తొలగించి శుభ్రం చేసి రంగులు వేశారు. ధర్మగుండంలో భక్తుల పుణ్యస్నానాల ఆచరించేందుకు నీటిని నింపి ఈరోజు ఉదయం 8 గంటలకు అర్చకులు, ప్రధాన అర్చకులు అప్పల బీమా శంకర్ మధ్య ప్రత్యేక పూజలు చేసి
ధర్మ గుండాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement