Friday, April 19, 2024

Tirumala : తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 11 కంపార్టుమెంట్లు నిండిపోగా.. ద‌ర్శ‌నానికి 12 గంటల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు వెల్లడించారు. నిన్న 74,412 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,626 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement