Tuesday, April 23, 2024

Tirumala : తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ..

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71, 461 మంది భక్తులు దర్శించుకోగా 26,631 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.77 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement