Sunday, March 24, 2024

ప్రలోభాన్ని కలిగించేది భ్రాంతి

”బ్రహ్మ సత్యమ్‌ జగన్మిథ్య” అంటూ మన వేదాలు, ఉప నిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మన చెవిలో ఇల్లు కట్టుకొని మరీ చెబు తున్నా కూడా ఈ దేహం, కాలం, సంపద, అందం, ఆనందం అన్నీ నిజ మను కొంటూ మోహార్ణవ భ్రాంతిలో సదా మునిగి తేలుతూండడం మానవ నైజం. ఈ ప్రపం చంతో అవినాభావ సంబంధం ఏర్పరచుకొని ఇక్కడి వస్తువులకు, వ్యక్తులకు, బంధాలకు లేని విలువలను ఆపాదిం చుకొని, అవి లేకపోతే మనలేమని మనం భ్రమిస్తున్నాం. దీనినే ‘భ్రమ’ లేక. ‘భ్రాంతి’ అంటారు. లేని వాటిని ఉన్నాయనుకోవడమే భ్రమ. వేదాంతశాస్త్రంలో నాలుగు రకాలైన భ్రాంతులు తరచూ చెప్పబడ్డాయి. అవి (1) రజ్జుసర్ప భ్రాంతి, (2) స్థాణు-పురుష భ్రాంతి,(3) శుక్తి-రజత భ్రాంతి, (4) మరు-మరీచిక భ్రాంతి.
వీటిలో మొదటిది ”రజ్జుసర్ప భ్రాంతి రజ్జువు అంటే తాడు. సర్ప మంటే పాము. రజ్జుసర్ప భ్రాంతి అంటే తాడును చూచి పాము అను కొని భ్రమపడటం. చీకటిలో వంకరగా పడి ఉన్న తాడును చూచి పా ము అనుకొని సామాన్యుడు భయపడతాడు. కానీ వివేకవంతుడు దానిని నిదానంగా, చక్కగా పరిశీలించి అది ‘తాడు’ అనే సత్యాన్ని తెలు సుకొని ముందుకు సాగుతాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు వాస్తవంగా అక్కడ ఉన్న తాడుమీద పాము రూపాన్ని పరచింది మన మనస్సు. ఉన్న రూపానికి భిన్నమైన రూపాన్ని దర్శించింది మనస్సే! దీనినే ఆది శంకరులు ‘అధ్యాస’ అన్నారు. ”అతస్మిన్‌ తద్బుద్ధి:- అధ్యాస” అని దీనికి వ్యుత్పత్తి.
రెండవది ‘స్థాణు-పురుష భ్రాంతి”. స్థాణువు అంటే స్థిరమైనది అని అర్థం. రాయి, కొయ్యదుంగ, మేకు లాగా స్థిరంగా, చలనం లేకుం డా ఉండేది. పురుషుడంటే మనిషి. దూరంగా, మసక వెలుతురులో ఒక కొయ్యదుంగనో, రాతిబండనో చూచి మనిషిగా భ్రమపడి, దొంగే మో అని భయపడడాన్ని స్థాణు- పురుష భ్రాంతి అంటారు.
పైన చెప్పుకొన్న రజ్జుసర్ప భ్రాంతి, స్థాణుపురుష భ్రాంతులు రెండూ మసక వెలుతురు లేదా గుడ్డివెలుగులో ఏర్పడినవి. కనుక వెలు గు ఉంటే భ్రాంతులు కలుగవేమో అని అనుకోకూడదు. వెలుగులోనూ ఏర్పడే భ్రాంతులూ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ”శుక్తి- రజ త”, ” మరు- మరీచిక” భ్రాంతులు.
మూడవది ”శుక్తి- రజత భ్రాంతి”. శుక్తి అంటే ముత్యపు చిప్ప. రజతమంటే వెండి. ఆల్చిప్పలలో వెలుతురు పడినప్పుడు అది వెండి బిళ్ళలాగా కన్పిస్తుంది. అయితే అది నిజంగా వెండి కాదు. వెండిబిళ్ళ అని భ్రమించి, దానిని సొంతం చేసుకోవాలనే ఆశతో దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకొంటాం. అది ఆల్చిప్ప అని తెలుసుకొని ఖంగుతింటాం. ఇదే విధంగా నీటిలోని చంద్రుని ప్రతిబింబాన్ని చూచి, ఆకాశంలో ఒక రు, నీటిలో ఒకరు- ఇలా ఇద్దరు చంద్రులున్నారేమో అని భ్రమిం చడం. జ్ఞానప్రకాశనం చేతనే సత్యాన్ని గ్రహంచగలుగుతాము.
ఇక నాలుగవది ”మరు మరీచిక భ్రాంతి”. ఎడారుల వంటి ప్రదేశా లలో ఇసుక దిబ్బల పైన ఎండ బాగా కాస్తున్నప్పుడు దూరం నుండి చూస్తే నీటి ప్రవాహంలాగా అలలు అలలుగా కనబడుతుంది. ఎండ మావులంటే ఇవే. దాహం తీర్చుకోడానికి ప్రాణులు ఆ మరీచికల వెంట పరుగులు తీసితీసి ఎంత దూరం పరుగెత్తినా ఇంకా అంతదూ రంలో ఉన్నట్లే కనబడే ఆ ఎండమావుల భ్రమలో పడి ప్రాణాలు కోల్పో తాయి.
ఈ నాలుగు భ్రాంతులలో రజ్జుసర్ప భ్రాంతి, స్థాణు-పురుష భ్రాం తి భయాన్ని కలిగించేవి కాగా, శుక్తి-రజత భ్రాంతి, మరుమరీచిక భ్రాం తి ప్రలోభాన్ని కలిగించేవి. మొదటి రెండు భ్రాంతులూ దగ్గరగా ఉండే వస్తువుల వలన కలిగితే, మిగిలిన రెండూ దూరంగా ఉన్న వస్తువుల వలన కలుగుతాయి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు, వేగం గా వెళ్తున్న రైలు కిటికీ లోనుండి చూస్తే చెట్లు, భవనాలు వేగంగా వెను కకు పరుగులు తీస్తున్నట్లు అనిపించడం సుప్రసిద్ధమైన సామూహక భ్రాంతులకు ఉదాహరణలు.
మరి ఈ భ్రాంతులు కలుగుతున్నది ఎవరికి? తాడు, స్థాణువు, ముత్తెపు చిప్ప, కాలిన ఇసుక, శరీరము, కన్నులు, ఇవేవి భ్రమపడ లేవు. మనస్సే సర్వ భ్రమలకూ మూలం. యోగవాశిష్ఠం ఇలా చెబుతోంది.
”స్ఫుర తి, వల్గతి, గచ్ఛతి, యాచతే/ భ్రమతి, మజ్జతి, సం#హరతి స్వయం
అపరతా ముపయాత్యపి కేవలం/ చలతి చంచ ల శక్తి తయామన:”
మనసు చంచలమైనది. ఆ చంచలత్వం వలన ఎన్నో వేషాలు వేస్తుంది. తాను ప్రత్యేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గుర్రంలాగా పరిగె డుతుంది. అది, ఇది కావాలని గొడవ చేస్తుంది. స్వయంగా భ్రమలో పడుతుంది. ఇదే స్వప్నం. తనే మునిగిపోయి, తనే లేకుండా పోతుంది ఇదే సుషుప్తి. తనే సంసారాన్ని పొంది సుఖ దు:ఖాలలో కొట్టుమిట్టా డుతుంది ఇదే జాగ్రత్తు. తనే కైవల్యాన్ని పొంది అన్నిటికన్నా మిన్నగా ఉంటుంది. ఇదే మోక్షము అంటూ అన్ని భ్రమలకు, ముక్తికి కూడా కారణం మనస్సే అని తెలుపుతుంది పై శ్లోకం.
కనుక అపరిపక్వమైన మనస్సే అలా ఒకదాని బదులు మరొక దాని ని భావించుకొంటుంది. దీనినే వేదాంతం అన్యథాకరణం అంటుంది. తాడును తాడుగానే మనసు గ్రహస్తే అది యథార్థ జ్ఞానం. దీనిని ”ప్ర మ” అంటారు. తాడును పాముగా భావిస్తే అది అన్య ధాకరణం. ఇదే భ్రమ. ఈ భ్రమను సత్వరమే ఉపశమింపచేయకపోతే అది చిలువలు పలువలుగా అల్లుకొనిపోయి, బలపడి, స్థిరపడిపోతుంది. భ్రమ ఉప శమించాలంటే ఆ మసక వెలుతురు తొలగాలి. జ్ఞానప్రకాశం జరగాలి.
”పటవద్రజ్జు భుజంగవత్‌ రజత విభ్రాంతి స్ఫురచ్ఛుక్తివత్‌/
ఘటవత్‌ చంద్ర శిలా జపా కుసుమరుక్సాంగత్య వత్తంచు వా
క్పటిమల్‌ నేర్తురు చిత్సు ఖం బనుభవింపన్‌ లేక దుర్మేధసుల్‌
చిటుకన్నం తలపోయజూతురధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా”
”ఓ శ్రీకాళహస్తీశ్వరా! అధములైన దుర్మేధసులు ‘పటవత్‌’, ‘రజ్జు భుజంగవత్‌’, ‘రజతశుక్తికావత్‌’, ‘ఘటవత్‌’, ‘చంద్రశిలాజపా కుసుమ రుక్సాంగత్యవత్‌’ అని శాస్త్రవాదాలు చేస్తారు గానీ, నిన్ను కాంచి శాశ్వ తమైన సుఖమును పొందలేరు. గోరంతలు కొండంతలు చేసి వ్యా ఖ్యానాలు, చర్చలు చేయడం అవసరమా? అని ధూర్జటి కవి చెప్పినట్లు గా ఈ వ్యాఖ్యానాలు మాని భగవత్కటాక్షానికై తపించాలి.
కనుక నిరంతర సాధనతోనే ఈ భ్రమలన్నీ తొలగించుకోవాలి. అందుకు భగవత్కృప తోడవ్వాలి. కానీ, ధూర్జటి కవి చెప్పినట్లు-
”అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్‌ సదా
కాంతల్‌ పుత్రులు, నర్థమున్‌, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిన్‌ చెంది చరించుగాని, పరమార్థంబైన నీయం దుతా
చింతాకంతయు చింత నిల్ప డు గదా శ్రీ కాళహస్తీశ్వరా!”
ప్రపంచమంతా ఒక పెద్ద మాయ అని, అశాశ్వతమని తెలిసికూడా మానవుడు నిరం తరమూ భార్య, పిల్లలు, తన సంపద, తన శరీరము శాశ్వతమనే మోహంలో, భ్రమలో మునిగి ఉంటాడు కానీ, పరమాత్ము డవైన నీపై రవ్వంతైనా మనసు నిల్పడు కదా! అని ధూర్జటి వాపోయా డు. కనుక ఆ మనస్సును దేవునిపై నిల్పగలిగే శక్తిని మనకు ప్రసా దించ మని సర్వేశ్వరుని దృఢంగా ప్రార్థించుకొందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement