Wednesday, April 24, 2024

రక్షణ కవచం… బాబా నిత్య ఆరాధన

ఈ కలియుగంలో క్షీణించిపోతున్న ధర్మాన్ని పరిరక్షించడానికి, పెచ్చుపెరుగుతున్న అధర్మాన్ని శిక్షించడానికి, ఆశ్రిత భక్తజనా వళిని శ్రేయో మార్గంలో నడిపించి వారిని మోక్షార్తులను గావించేం దుకు నిర్గుణ, నిరాకార, త్రిగుణాతీతమైన పరబ్రహ్మం ఒక మానవ దేహం ధరించి 19వ శతాబ్దంలో దివి నుండి భువికేగింది. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతారమే శ్రీ శిరిడి సాయినాధులు. శ్రీసాయినాధుని కృప వలన కోట్లాదిమంది అనుగ్రహింబడ్డారు. ఆయన అపురూపమైన కరుణా కటాక్షాలు ఇప్పటికీ ఆయనను చిత్తశుద్ధితో స్మరించుకునేవారికి లభ్యమౌతూనే వున్నాయి. అయితే అందుకు కావల్సింది నిరంతర చింతన, సదాస్మరణ. అనునిత్యం భక్తి విశ్వాసాలతో ఆరాధన. ఒక్క మాటలో చెప్పాలంటే మనం సాయి నిత్య భక్తులం కావాలి.
భక్తులలో గురువారం భక్తులు కూడా వున్నారు. కేవలం సాయిని గురువారం మాత్రమే గుర్తుంచుకొని ఆరాధించడం, పూజాది కార్య క్రమాలను నిర్వర్తించడం, సాయి దేవాలయానికి వెళ్ళి కోరికల మూట విప్పి ప్రార్థన చేయడం, ఆ మర్నాడు మళ్ళీ సాయిని మర్చిపోవడం, సాయి సంపూర్ణ అనుగ్రహం నిత్య భక్తులకు మాత్రమే లభ్యం. గురు వారం భక్తులపై వర్తించే సాయి కరుణా కటాక్షాలు అతిస్వల్పం.
సాయి తనను ఏవిధంగా సేవించాలో చాలా స్పష్టంగా చెప్పారు. సాయి సచ్చరిత్ర నుండి ఈ క్రింది వాక్యాలు సంగ్రహించబడ్డాయి.
”నన్ను శ్రద్ధాభక్తులతో సదా స్మరించండి. నన్ను నిస్వార్థంగా సేవిం చండి. మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. నిత్యం నా స్మరణ చేసేవారిని, నన్ను ఆరాధించేవారిని నేను తప్పక ఉద్ధరిస్తాను. ఇదియే నా వాగ్దానం”
శ్రీ సాయిదేవుని పలుకులు నిశితంగా పరిశీలించినచో సదాస్మరణ, నిస్వార్థంగా సేవ, నిత్య నామస్మరణయే ఉత్తమమైన ఆరాధన అని మన కు అవగతమౌతోంది. అనగా సాయి నిత్య భక్తులకే ఆయన సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అనన్య చింతన, ఉపా సన, నిత్యం ఆరాధన చేయాలని అప్పుడు వారి యోగక్షేమాలను తప్పక చూస్తానని అద్భుతంగా తెలియజేసారు.
పనుల వత్తిడి వలన లేక అలసత్వం లేక స్వార్థ చింతనతోనే ఈ కాలంలో చాలామంది భక్తులు కేవలం గురువారాలలోనే సాయిని సేవించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. వారంలో కనీసం ఒక రోజు దైనందిన కార్యక్రమాలను పక్కన పెట్టి దేవాలయానికి వెళ్ళడం మంచిదే కాని అటువంటి భక్తులకు శ్రీ సాయి నుండి లభించే కటాక్షం, అనుగ్రహం స్వల్పంగా వుంటుంది. అందుకే ఈ కలి కల్మషం నుండి విడివడాలన్నా, శ్రీ సాయి చేత ఉద్ధరింపబడాలన్నా శ్రీ సాయి యొక్క అనూపమానమైన రక్షణ కవచం లభించాలన్నా మనం చేయాల్సింది సాయి నిరంతర, నిత్య ఆరాధన.
శరీరం ఏ కర్మ చేస్తున్నా మనస్సు దైవ విచారణలో, స్మరణలో, చింతనలో మునిగి వుండాలి. ఆహారం స్వీకరించేముందు సర్వం శ్రీ శిరిడీ సాయి సమర్పయామి అని మనస్సులోనే అర్పించాలి. ఆహారం లో ఒక ముద్ద పక్కన పెట్టి ఇంటి బయట విడిస్తే పక్షులు, చీమలు వంటి క్రిమికీటకాదులు వాటిని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకుంటాయి. పనిపారంభించబోయే ముందు సాయి అని ఒకసారి తలుచుకుంటే చాలు ఎటువంటి కష్టతరమైన కార్యమైనా దిగ్విజయంగా పూర్తవుతుం ది. చివరగా కోరికలతోకాక నిస్వార్థంగాసాయిని ప్రార్థించాలి. మన ము అడిగిందికాక మనకు అవసరమైన వాటిని శ్రేయోదాకమైన వాటిని సాయి తప్పక ప్రసాదిస్తారు. మనకు ఇంతవరకు భగవంతుడు ప్రసా దించినవి, వర్తమానంలో ప్రసాదిస్తున్నవి, భవిష్యత్తులో ప్రసాదించ బోయేవి కూడామన మేలు కోరేవిగా వుంటాయన్న దృఢ విశ్వాసంతో ఆరాధన చేస్తే జీవితంలో నిత్య ఆత్మసంతృప్తికలిగి ఉల్లాసభరితం, ప్రశాంతభరితం అవుతుంది. దీనినే శాస్త్రం ప్రసాద భావంతో జీవించ డం అని పేర్కొంది. శిరిడీసాయి ఆరాధనలో ఈ భావంతో జీవించడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. గుర్తుకు వచ్చినప్పుడో లేక కష్టాలు చుట్టుముట్టినప్పుడో కాకుండా, అనుక్షణం సాయిని తలచు కుంటూ, సాయి నామం పునశ్చరణ చేసుకుంటూ వుంటే ఆ సాయి తప్పక తన అనుగ్రహం, కరుణా కటాక్షాలు మనపై కురిపిస్తారు.
”మన భక్తి ఆరాధనలను కేవలం గురువారాలకు మాత్రమే పరి మితం చేయక అన్ని రోజులలోనూ నిత్య భక్తులవలె సాయిని సేవిం చడం సాయి కరుణా కటాక్షాలకు పాత్రులవడానికి అతి సులభమైన మార్గం. సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు.

– సిహెచ్‌.ప్రతాప్‌, 9136827102

Advertisement

తాజా వార్తలు

Advertisement