Thursday, April 25, 2024

సాయి చేష్టల వెనుక గూఢార్ధం

సాయిబాబా అవతార మూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసినవారు… ఆయనతో కలిసి నడిచినవారు… సమకాలీయులు.. ఆయన కృపకు పాత్రులై తరించినవారు ధన్యు లు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం అందరికీ దొరికేది కాదు. ఆ పుణ్యమూర్తి సాం గత్యం పొందాలని, వారికి సేవ చేయాలని, ఆయ నకు తినిపించాలని తపించేవారు. కానీ ఆ అదృ ష్టం అందరికీ లభించేదికాదు. నిజంగా జన్మజ న్మలకు ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందినవా రు అదృష్టవంతులు. మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్‌, హేమాడ్‌పంత్‌, కాకాజీ, నానాపాటేకర్‌ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు. ఇక తాత్యా తల్లి బాయిజాబాయి అయి తే సాయిబాబాను తన పెద్దకొడుకుగా భావించే ది. సాయిబాబా కూడా ఆమెను తన తల్లిగా ఆద రించేవారు. ఆమె పెట్టిన భోజనాన్ని మనసారా స్వీకరించేవారు. వారిద్వారానే నేడు మనం చదు వుకుంటున్న సాయిలీలామృత గాథలు చదువు కుంటున్నాము. సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ”ఇప్పుడు వద్దు” అని చెప్పినా పట్టించుకో కుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళి న భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రా వలసి వచ్చేది.
ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దే శంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవా రు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి, కష్టనష్టాలు కొనితెచ్చుకునేవా రు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా మాటల మీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.
సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళితే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీమ్‌గావ్‌, దక్షిణాన ఉన్న రహితా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చె ప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తు లకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వె ళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది. సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగ బోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవి చిత్రమైన సైగలు చేసే వారు. కొన్నిసార్లు పెద్ద పెద్దగా కేకలు వేసే వారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపు మీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తుల ను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ”పిచ్చి పకీరు” అనిపించేలా ఉండేవి. బా బా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుక లా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యే ది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా చిత్రంగా ప్రవర్తించేవారు.
బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కను న్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వా రిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీ దులో ఓ మూల కూర్చుని వున్నా మహానంత టినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.
సాయిబాబాను చేరువగా చూసినవారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహం చేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరి పూర్ణంగా అర్ధం చేసుకుని ఆయన మార్గాన్ని తూ చ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు. వారి కష్టా లను తీర్చేవారు. బాధల నుంచి విముక్తిలను చేసేవారు.

  • డా|| చదలవాడ హరిబాబు 9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement