Friday, April 19, 2024

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 6 గంట‌ల స‌మ‌యం

తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ త‌గ్గుముఖం ప‌ట్టింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి ఆరు గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 74,297 మంది భక్తులు దర్శించు కోగా 27, 317 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement