Thursday, April 18, 2024

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. కోర్కెలు తీర్చే కోనేటి రాయడు కనుకనే రోజుకు లక్షకు పైగా భక్తులు స్వామి వారి దర్శన కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. తమ తాహతకు తగట్టుగా చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు. అయితే ఈసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గడిచిన ఎనిమిది నెలల హుండీ ఆదాయాన్ని పరిశీలించగా రూ.1,161 .74 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 2019-20లో వచ్చిన రూ. 1,313 కోట్ల ఆదాయమే అత్యధికమని వివరించారు. ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ యేడాది హుండీ ఆదాయం రూ.1600 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement