Wednesday, April 24, 2024

అప్పన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

28 రోజులలో రూ.1.05 కోట్లు
బంగారం, వెండి కానుకలు సమర్పణ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహ స్వామి దేవస్థానానికి భక్తులు సమ ర్పించిన హుండీ కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఈ మేరకు సోమవారం ఆలయ ఇవో ఎం.వి. సూర్యకళ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థల సేవకులు సంయుక్తంగా హుండీలను తెరిచి లెక్కిం చారు. 28 రోజులకు గాను రూ. 1,05,62,420 ఆదాయం లభించింది. వీటితో పాటు బంగారం, వెండి కానుకలు కూడా పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. ఇంకా అమెరికా, సింగపూర్‌, అర బ్‌ ఎమిరేట్స్‌, ఇంగ్లాండ్‌ దేశాలకు చెందిన వి దేశీ కరెన్సీ కూడా భక్తులు హుండీలో వేశారు. ఇటీవల కా లంలో సింహగిరికి భక్తుల తాకిడి ఘననీయంగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement