Saturday, April 20, 2024

తిరుమ‌ల‌లో ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. చిన్నశేషవాహనంపై మలయప్ప స్వామి క‌టాక్షం

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వ‌హిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రెండో వాహనమైన చిన్నశేష వాహనసేవ వైభ‌వంగా నిర్వ‌హించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. స్వామివారి దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement