Wednesday, April 24, 2024

ప్రసాదం డోర్‌ డెలివరీ!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల ప్రసాదంను ఆర్టీసీ, తపాలాశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారం తో డోర్‌ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొంద లేని వారికి భారత పోస్టల్‌ సర్వీసు, ఆర్టీసీ కొరియర్‌ సర్వీసు ద్వారా ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల ఆర్డర్‌ మేరకు ఇంటి నుంచే బెల్లం-బంగారం ప్రసాదం అమ్మ వారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్లి అమ్మ వారికి సమర్పించి మళ్లి దాన్ని భక్తులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో మీ సేవ లేదా టీయాప్‌ ఫోలియో (మొబైల్‌ ప్లే స్టోర్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని)లో బుక్‌ చేసుకోవాలన్నారు. అనంతరం వారికి పోస్టల్‌ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్‌ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్‌కు భక్తులు రూ.225 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement