Thursday, March 28, 2024

మహోదయ పర్వదినంచొల్లంగి అమావాస్య

పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సము ద్రంలో కలుస్తుంది.
ఈ రోజు గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు.
”ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాద్భాగిరధీ స్మృతా
తయోరేక తరా సేవ్యా గౌతమీ తత్ర పావనీ”
గోదావరి గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. అందువల ననే కాశికి పోయిన వారు గంగా జలము తెచ్చి గోదావరిలో కలిపే ఆచార ము అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయమై ఉంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల చొల్లంగి సమీపాన స్నానం చేస్తే, నదిలోను, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సము ద్రంలో కలిసే చోటు వద్ద స్నాన మాచరించి, పితృ తర్పణం గావిస్తే వారి పిత రులు 21 తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగల రని, తత్ఫలితంగా స్వర్గ లోక స్వర్ణలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋ షులు ఏడు పాయలుగా తీసుకొనిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతము డు స్వయంగా కొనిపోయిన శాఖ ”గౌతమి” నామాంకితయై గోదావరి యగ్రము వద్ద మాసానితిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగుతున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీ పాన, భరద్వాజ భైరవ పాలెం/తీర్ధాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సము ద్రంలో కలుస్తున్నాయి.
”రేవా తీరే తప: కుర్యాత్‌ మరణం జాహ్నవి తటే…
దానం దద్యాత్‌ కురుక్షేత్రే గౌతమీ మ్యాం త్రితయం పరం”
రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణం ముక్తి. కురుక్షేత్రంలో దానం ముక్తి. గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యా లు లభిస్తాయి.
గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని ”సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర” లేదా ”సప్త సాగర యాత్ర” అంటారు. సంతానం, తదితర కోరికలు ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బ#హుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది. ఏడు తావులు చూసుకుని, ప్రాయకంగా మాఘ శుక్ల ఏకాదశి నాటికి వశిష్టా సాగర సంగమ స్థానమైన ”అంతర్వేది” చేరతారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకా దశిని ఆ ప్రాంతంలో ”అంతర్వేది ఏకాదశి” అని పిలవడం పరిపాటి. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా పరి గణింపబడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మ#హత్తు గల చొల్లంగికి ప్రసిద్ధి, తుల్యభాగ వల్ల కలుగుతున్నది. ”మహోదయ నామాలభ్య యోగ పుణ్యకాల: అమావాస్యా సోమ వాసర వ్రతమత: పద్మ యోగ పుణ్యకాల”మని పేర్కొనబడింది. రవి శ్రవణ వ్యతీపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము, పద్మయోగ పుణ్యకాల ము కలుగుతుంది. పుష్య మాసంలో వచ్చిన అమావాస్య మహోదయ అమావాస్య. అమావాస్య, ఆదివారం, శ్రవణా నక్షత్రం మూడు కలిసి వస్తే దానిని అర్ధోదయ అమావాస్య అంటారు. ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపించి మిగిలిన రెండు కలిస్తే దానిని మహోదయం అంటారు. ఈసారి పుష్య బహుళ అమావాస్య శ్రవణా నక్షత్రం, వ్యతీ పాత కలిసి వస్తున్నాయి. కనుక ఇది మహోదయ పర్వకాలం. మహత్తర దినం. పుష్య కృష్ణ అమావాస్య ప్రస్తుతం మంగళ వారం మహోదయ పర్వకాలంగా, పుణ్యప్రదమైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రద క్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రం చెబుతోంది.
– రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement