Saturday, April 20, 2024

కోటిలింగేశ్వర క్షేత్రం

కోటిలింగేశ్వరుని అద్భుతమైన ఆలయం కర్ణాటకలోని కొ లార్‌ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో దాదాపు ఒక కొ టి చిన్న శివ లింగాలతో పాటు, లింగస్వరూపం, నందీశ్వరుడు కొలువుతీరి వున్నా రు. శివలింగానికి దగ్గరగా నిర్మించిన నీటి కొలను కూడా ఉంది, ఈ కొలను నీటితోనే భక్తులు శివలింగాలకు అభిషేకం చేస్తారు.ప్రతి సంవత్సరం రెండు లక్షలకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సం దర్శిస్తారు.కార్తిక మాసం, మహా శివరాత్రిలాంటి ప్రత్యేక సందర్భాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ స్వామి ని దర్శించి, అభిషేకాలు, పూజలు చేసుకుంటారు.
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ 108 అడుగుల (33 మీ) పొడవు ఉన్న శి వయ్య, 35 అడుగుల (11 మీ) పొడవైన నందీశ్వరుడు విగ్రహం. దీని చుట్టూ 15 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు కోటి చిన్నచిన్న లింగాలు ఉన్నాయి. నందీశ్వ రుడు విగ్రహాన్ని 60 అడుగుల(18 మీ) పొడవు,40 అడుగుల(12 మీ) వెడల్పు,4 అడుగుల(1.2 మీ)ఎత్తు కలిగిన ప్లాట్‌ ఫాంపై ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు చిన్న దేవాలయాలను నిర్మించారు.
ఈ ఆలయంలో ఒక కోటి శివలింగాల స్థాపన ఉంది కాబట్టే ఈ క్షేత్రానికి కోటిలింగేశ్వర అని పేరు పెట్టారు. ప్రస్తుతం వంద లక్షల శివలింగాలు కొలు వై ఉన్నాయి.
కోటిలింగేశ్వర ఆలయచరిత్ర

ఈ ఆలయ ప్రాంగణంలో కోటి లింగాలను వ్యవస్థాపించా లనే సం కల్పంతో బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ఆ లయాన్ని స్వామి సాంబశివమూర్తి 1980లో నిర్మించారు. మొదటి లింగాన్ని 1980లో స్థాపించారు. అప్పటి నుండి ఈ ఆలయంలో అనేక లింగా లు స్థాపించడం మొదలుపెట్టారు. ఆలయ ప్రాంగణంలో వున్న పద కొండు ఆలయాలలో మొదటిది విష్ణువు, బ్రహ్మదేవుడు, మహశ్వ రుల ఆలయాలు. తరువాత కోటిలింగేశ్వర ఆలయం ఉంది. వీటితో పాటు దేవాలయంలో అన్నపూర్ణేశ్వరి ఆలయం, కరుమారి అమ్మ ఆలయం, శ్రీ వేంకటే శ్వరస్వామి ఆలయం,పాండురంగస్వామి ఆల యం, శ్రీరామ, సీతామాత, లక్ష్మణ దేవాలయం, పంచముఖ గణ పతి ఆలయం,ఆంజనే య ఆలయం, సంతోషిమాత ఆలయాలను భక్తులు దర్శించవచ్చు. భక్తులు లింగాలను వ్యవస్థాపించవచ్చు. ప్రత్యేక పూజలు కూడా చేసుకోవచ్చు.వారి పేర్లలో ఎన్ను కున్న ఏ రోజునైనా ఈ లింగాలను స్థాపించ వచ్చు. నిత్యపూజలు, కైంకర్యాలు నిర్వహించ బడతాయి. ఇక్కడ కొలువుతీరిన లింగాలకు నిత్యపూజా కౌంకర్యాలు అందిం చబడతాయి ఈ ఆలయాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రభు త్వం ప్రకటించింది, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పర్యాటకులు వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం విశ్రాంతి గృహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉచిత సామూహక వివాహాలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement