Wednesday, April 17, 2024

హస్తినలో అష్టాధిక శత దీపోత్సవం

టీటీడీ ఆధ్వర్వంలో సత్యనారాయణ స్వామి వ్రతం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం దీపాల వెలుగుల మయమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని మందిర్‌ మార్గ్‌లో ఉన్న బాలాజీ మందిర్‌లో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అష్టాధికశత దీపోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ధూపదీప నైవేద్యాలతో వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో తెలుగువారితో పాటు ఉత్తరాదికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతియేడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement