Tuesday, April 23, 2024

కార్తీక మాసంలో సాలంకృత కన్యాదాన ఫలము

కార్తీక మాసము నెలరోజులు ఏ దానము చేసినా పుణ్యమే! అయితే సాలంకృత కన్యాదానము చేస్తే తెలిసి తెలియక చేసిన పాపా లన్నీ పోవడమే కాకుండా అత్యంత పుణ్యప్రదమని కార్తీక పురాణంలోని ఈ కథ తెలియజేస్తున్నది.
కార్తీక మాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తాంబూ లాది సంభావనలతో తృప్తిపరచిన ఫలము కలుగు ను. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాప ములు చేసివున్నా, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాస మందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్ధగా అలకింపుము.
సువీర చరిత్రము
ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన ”సువీరు” డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబ డినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహనుడయి నర్మదా నదీ తీరమందు పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షిస్తూ కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపో యినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచు వారలకు కనులపం డువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చ టగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు ¸°వనదశ వచ్చె ను. ఒక దినము వాన ప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అంద చందములకు పరవశుడై అ బాలిక ను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు ”ఓ మునిపుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలోనున్నాను. అష్టదరిద్రములు అనుభ వించుచున్నాను. మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు” నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైన నూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి
ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతో షించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.
అటులా మునికుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంత వరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటు ల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.
ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరము నుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని ”ఓయీ! నీవె వ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునం దు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్య మం దు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి ?” అని ప్రశ్నించగా , సువీరుడు ”మహా నుభావా! నేను వంగ దేశమును నేలు చుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్ర మించుటచే భార్యా సమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేది యునూ లేదు. పుత్రశోకము కంటె గొప్పదు:ఖము లేదు. అటులనే భార్యా వియో గము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవి లోనే సకుటుంబముగా బ్రతుకుచు న్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేప ము చేయుచున్నాను” అని చెప్పగా, ”ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మ ములా
లోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయిం చిన వారు ‘అసిపత్రవన’ మను నరక మనుభవిం తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రీత్య ర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అది యునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవ తలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవించును. కన్యావిక్రయ ము జేసినా వారికి యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబో యే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదా చార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యా దానము చేయుము. అటుల చేసిన యెడల గంగా స్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును” అని రాజునకు హతోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి ”ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కు వా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుత మున్న అవకాశమును చేతులారా జారవిడువమం టారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసు కొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కు మార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను” అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించె ను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మ యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెం దిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభ వించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయ ము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకము
నకు తీసుకొని వచ్చిరి. అంతటా శ్రుతకీర్తి ”నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?”నని మనస్సులో అనుకొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమ స్క రించి ”ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్దిశాలివి, ప్రాణకోటినంతను సమంగా జూచుచుం దువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు” అని ప్రాధేయ పడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి ”శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరము లవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభవించుటయేగాక, నీచజన్మలెత్త వలసి యుండును. నీవు పుణ్యాత్ముడ వనియు ధర్మాత్ము డవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవం తుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలం కృతముగా కన్యా దానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వీ కులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గ లోకమున కేగుదురు. కార్తీకమాసములో ”సాలంకృత కన్యాదానము” చేసినవాడు మహా పుణ్యాత్ముడగును. పుత్రికా సంతా నము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివా#హ మొనర్చి నను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము” అని పలికెను.
శ్రుతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీర ములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమా ర్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయ ములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీ రుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములో నున్న పితృదేవతలను కలసికొనెను.
కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయం చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసంలోకన్యాదానం చేయాలని దీక్ష బూని ఆచ రించినవాడు. విష్ణుసాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగినా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతాడు.

– డా.చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement