Friday, April 26, 2024

దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవం

దక్షిణ భారత దేశంలోనే ప్రాచీనమైన, పంచ భూత లింగములలో నాల్గవది అయిన వా యు లింగము గల శైవ పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తి. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణ ముఖి నదికి తూర్పు ఒడ్డున ఉన్న శ్రీకాళహస్తి పట్ట ణంలో వుంది. శ్రీకాళహస్తీశ్వరస్వామి కొలువుదీరి వున్న గర్భాలయంలో ఎల్లవేళలా వెలుగుతూ వుండే రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి నిశ్చలముగా ఉంటుంది.
పంచ భూతాలయిన భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని శక్తులను పరమేశ్వరుడు తనలో నిక్షేపించుకొని, లింగాకారంగా ఆవిర్భవించాడు. కంచి క్షేత్రంలో పృథ్వీ లింగంగా, చిదంబర క్షేత్రంలో ఆకాశ లింగంగా, జంబుకేశ్వర క్షేత్రంలో జల లింగంగా, అరుణాచలంలో అగ్ని లింగంగా, శ్రీకాళహస్తిలో వాయు లింగంగా ఆవిర్బ éవించాడు. అందుకే శ్రీకాళహస్తీశ్వరుని పక్కనున్న రెండు దీపాలు మహా శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన వచ్చే గాలికి కదులు తూ వుంటాయి. ఈ శివలింగం స్వయంభూ లింగం.
శైవ క్షేత్రాలలోకల్లా అత్యుత్తమమైంది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ఇక్కడి పర్వత శ్రేణులే దక్షిణ కైలాసగిరి పర్వతాలు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి, శ్రీకాళహస్తీశ్వరుని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రశస్తి. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పాతాళ గణ పతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహాద్వా రం ఎదురు) ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు.
క్షేత్ర పురాణ కథనాల ప్రకారం దక్షిణ కైలాసమందు వాయు లింగాకృతి గల శివలింగాన్ని కాళం అనే పేరుగల సర్పం ప్రాత:కాలమందే మణులతో పూజిస్తూండేది. మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చే ఏనుగు శివునికి సర్పంచే సమర్పించబడ్డ మణులను రాళ్ళుగా భావించి, వాటిని తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో లింగానికి అభిషేకం చేసి, కమలాలతో పూజి స్తూండేది. సర్పం సమర్పించిన మణులను ఏనుగు, ఏనుగు సమర్పిం చిన కమలాలను సర్పం తొలగిస్తూండేవి. తమ పూజలకు భంగం కలిగిస్తున్న వారిని కనిపెట్టి, శిక్షించాలని ఒకటికొకటి భావించాయి.
ఒకరోజు సర్పం శివలింగం వెనుక భాగాన వేచి ఉండగా, ఏనుగు ప్రతి రోజులాగే వచ్చి, మణులను తొలగించి, అభిషేకం చేసి పద్మాలతో పూజిస్తూం డగా సర్పం, తను సమర్పించిన మణులను తొలగించిన ఏనుగు తొండం లోకి ప్రవేశించింది. ఆ బాధను భరించలేక ఏనుగు ఘీంకారం చేస్తూ శివుని వెనుక భాగాన గల పర్వతాన్ని తొండంతో ఢీకొట్టింది. వెంటనే ఏనుగు, అదే సమయంలో తొండంలో గల సర్పం కూడా మరణించడం జరిగాయి. ఒకేసారి రెండు జీవులూ పరమ శివునిలో ఐక్యమైనాయి.
పరమశివుడు వాటి భక్తికి మెచ్చి వరం కోరుకోమనగా, అవి, ఆ వాయు లింగం తమ పేరున ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. మొదట ‘శ్రీ’ అనే పేరు గల సాలీడు శివ సాయుజ్యం పొందడం, తర్వాత కాళం, హస్తి శివసాయు జ్యం పొందినందున, వాటి కోరికపై పరమేశ్వరుడు వెలసిన వాయులింగా న్ని ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అని, ఆ క్షేత్రం దక్షిణ కైలాసానికి బదులుగా ‘శ్రీకాళహస్తి’ అని పిలువబడుతుందని కైలాసనాథుడు అనుగ్రహంచినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీ.శ. 12వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు న్నాయి. రాజేంద్ర చోళుని పాలన 13వ శతాబ్దంలో ముగిసిన తర్వాత, విజ య నగర రాజులైన సాళువ రాజు, శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాళహస్తి జమిం దారుల హయాంలో ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందినట్లు చెపుతారు.
తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని, మూడవ కులోత్తుంగ చోళు డు ఇతర ఆలయాలను నిర్మించారు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసిం#హ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజ యనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి గోపురాన్ని నిర్మించినట్లు తెలియజేస్తుంది. క్రీస్తుశకం 1529 అచ్యుత రాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు.
ఈ ఆలయంలో ప్రధానంగా రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు సేవలు నిర్వహంచనున్నారు. ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఈనెల 13వ తేదీ సోమవారం భక్తకనప్ప ధ్వజారోహణం, 14వ తేదీ మంగళవారం స్వామివారి ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 18వ తేదీ శనివారం మహాశివరాత్రి మహా పర్వదినం రోజు నందిసేవ, లింగోద్భవం, 19వ తేదీ ఆదివారం రథోత్సవం (ఉద యం), బ్రహ్మరాత్రి, తెప్పోత్సవం, 20వ తేదీ శివపార్వతుల కల్యాణం. (స్కంద రాత్రి), 21వ తేదీ సభాపతి కల్యాణం (ఆనంద రాత్రి), 22న గిరి ప్రద క్షిణ. (రుషి రాత్రి), 23న తీర్థవారి, ధ్వజావరోహణం, 24న పల్లకీ సేవ (రాత్రి), 25వ తేదీ ఏకాంత సేవ, 26వ తేదీ ఆదివారం నిత్యోత్సవం, అభిషే కం నిర్వహంచనున్నారు. ఈ రోజుతో శ్రీ కాళహస్తీశ్వరుని శివరాత్రి బ్రహ్మో త్సవాలు ముగుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement