Thursday, April 25, 2024

జన్మజన్మలకు వెంటాడే దుష్కర్మ ఫలితం!

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ – ఎలా ఎందుకు తుడు చుపెట్టుకుపోతాయో- ఏ జన్మలో అయినా పాపం చేస్తే అది ఎన్ని జన్మలు ఎత్తినా ఎలా వెంటాడుతుందో తెలుసుకుందాం.
కార్తీకమాసం కదా? ఈ మాసంలో కార్తిక శుద్ధ పాడ్యమి మొదలు ఈ రోజువరకు చాలామందిమి చాలా పూజలు చేసివుంటాము. అలాగే వ్రతాలు, నోములు, దానాలు చేసి వుంటారు. శివకేశవుల దర్శనం, దీపాలు వెలిగించడం చాలామంది చేసేవుంటారు. మేము ఇన్ని దానాలు, ధర్మాలు చేసాము అని విర్రవీగుతుంటాము. కానీ అవి ఎంతవరకు మనల ను భగవద్‌ సన్నిధికి చేర్చుతాయని ఎవరమూ ఆలోచించము కదా!
అలాంటి ఒక సంఘటన మహాభారతంలో చోటు చేసుకుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకుని #హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.
కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి భోరున విలపిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి, కృష్ణుడిని ఇలా నిలదీస్తాడు. ”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పో యావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.
ధృతరాష్ట్రుని నిందలన్నీ విన్నాడు. అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.
”ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగ డానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొర కని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట, వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి,
వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని అక్కడి నుండి పారిపోయాయి. అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూరు గురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి.
ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్ప కుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది, కర్మ నుం చి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లిd కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. ”కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి… ”ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మ లు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.
అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలి యదు, అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు, అ#హంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకో వాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. భూమి మీద పడిన ప్పటి నుండి భూమిలో కలిసేంతవరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి.
ఏ ఆధ్యాత్మిక కథ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కథైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహంచాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటి నుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!

Advertisement

తాజా వార్తలు

Advertisement