Thursday, April 25, 2024

తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమ‌ల‌, ప్ర‌భ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. సాధారణ రోజుల్లో వేలాది మంది దర్శించకోగా.. ప్రత్యేక దినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 17223 మంది భక్తులు దర్శించుకోగా.. 7149 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.1 కోటి 51 లక్షల రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తులు సంఖ్య తగ్గిందని, ప్రత్యేక దినాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement