Saturday, March 23, 2024

దివ్య మంగళ పంచ నారసింహ క్షేత్రం

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. శాంతమూర్తిగా ఇక్కడ కొలువై వున్న లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మార్చి రెండవ తేదీవరకు అంగరంగవైభవంగా జరుగనున్న బ్రహ్మోత్సవాల సంరంభ వేళ… ఆ లక్ష్మీనరసింహుడి దివ్య మంగళ క్షేత్ర మహిమను స్మరించుకుందాం. ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాద మహర్షి చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఆంజనేయస్వామి సలహాపై ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతు న్న ప్రదేశంలో చాలాకాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వే షణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదు గానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ శ్రీహరి ఆయుధం అయిన సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసు ని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధిం చి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయ బోవు చున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానం అయినట్లు కథనం.

యాద మహర్షి తన తపస్సుని కొనసాగించగా, ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమై, మహర్షి కోరిక మేర అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి గా వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిద్ధ కెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని అంటారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహ స్వామి స్తంభాన్ని చీల్చు కుని వచ్చి హరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచ టం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలు లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆమె ప్రత్యక్ష మై స్వామిని శాంతింప చేసిందట. ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో వున్న యాద గిరిలో లక్ష్మీ నరసింహ స్వామిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దే రారు, లక్ష్మీసమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదు డూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుం ది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేట ప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట.

పాదాల గుర్తులు కొందరు చూశారుట. వా రు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహ స్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం… ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రా మాయణంలో వున్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి, అతనినే హాదర్షి అని కూడ అంటా రు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి ”ఏంకావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారికి ”శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యా దర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వా ల, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిద్ధ కెక్కింది. మంగళవారం విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ఆరంభమై అలంకార అవతార సేవలతో కొనసాగి మార్చి 2న చక్రస్నానం, మహాపూ ర్ణాహుతి, 3వ తేదీ స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement