Saturday, April 20, 2024

ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

రావణసంహారం జరిగిపోయింది. రాము లవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నా రు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగం గా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒక రోజు రాములవారు సభలో కూర్చుని ఉన్నారు. అనేక విషయాల గురించి చర్చించుకుం టున్నారు. ఆ చర్చల్లో యుద్ధానికి సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ”14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రా హారాలు లేకుండా గడిపాడు కాబట్టే… ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,” అని ఎవరో గుర్తుచేశారు.
ఆ మాటలు విన్న రాములవారికి ఒక అను మానం వచ్చి ”లక్ష్మణా! 14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందు కు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంత:పురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలు సు. కానీ రోజూ నీకు అందిం చిన ఆహారాన్ని ఏం చేశావు,” అని అడిగారు.
”మనం వనవాసం చేస్తు న్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒ క చెట్టు తొర్రలో ఉంచేవా డిని” అని జవాబిచ్చాడు లక్ష్మ ణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట.
దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కిం చారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గి నట్లు తేలింది. ”లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆ హారంగానీ ఆరగించావా ఏం!” అని పరిహాసంగా అడిగారట రాములవారు.
”అన్నయ్యా! మొదటి సందర్భంలో తండ్రి గారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు.
రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు.
మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకు పోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు.
నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూ ర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు.
మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైనపోరు జ రిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు.

ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజు న బ్ర#హ్మ#హత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు.
మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లం కావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహా రం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,” అని బదు లిచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా.
అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయ న ప్రసన్నులయ్యారు. ”తల్లిd! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిల బడగలిగాము. అందుకే సీతా లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!” అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్ర హానికి ఊర్మిళ కళ్లు చెమ్మగి ల్లాయి. కానీ ”ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చో టుకంటే వేరే వరమేదీ వ ద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నీ అను గ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్ర#హంచు,” అని వేడుకుందట ఊర్మిళ. ”కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణు డు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటా డు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయం లోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదం లో కొలువై ఉంటావు,” అంటూ వరాన్ని అందిం చారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాల యం కనిపిస్తుంది.
అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదా న్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తుల కు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే!
ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.
– డా|| చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement