Tuesday, April 23, 2024

యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

యాదాద్రి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు, మూడు రోజులుగా యాదాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ ఉచిత బస్సుల్లో భక్తులు ప్రయాణించి కొండపైకి చేరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement