Thursday, April 18, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల సమ‌యం

తిరుమల: క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో టీటీడీ అధికారులు అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆదివారం కావ‌డంతో భ‌క్తులు అధిక సంఖ్య‌లో స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చారు. తిరుమ‌ల‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్‌ వెలుపలకు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 72,226 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.74 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement