Thursday, April 25, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శిలాతోర‌ణం వ‌ర‌కు భ‌క్తుల క్యూ

వేస‌వి సెల‌వులు రావ‌డంతో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. దాంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా 40,343 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement