Thursday, March 28, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి దర్శనం 8 గంటల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 73,375 మంది దర్శించుకోగా 31,117 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.71 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement