Saturday, April 20, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో తిరుమ‌ల‌కు విచ్చేయ‌డంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,229 మంది దర్శించుకోగా 31,381 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement