Friday, April 26, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భ‌క్తులు అధిక సంఖ్య‌లో తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ నెల‌కొంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 18 కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తులు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 57,147 మంది దర్శించుకోగా 26,094 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.78 కోట్ల‌ హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement