Friday, April 19, 2024

శారదా పీఠం వార్షికోత్సవానికి రండి

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి రావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పీఠం ఉత్తరా ధికారి స్వాత్మానందేంద్ర సర స్వతీ స్వామి ఆహ్వానం పలికారు. విజయవాడ రాజ్‌ భవన్‌కు మంగళవారం వచ్చిన సరస్వతీ స్వామి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుండి పదకొండు వరకు నిర్వహించే పీఠం వార్షిక మ హోత్సవానికి హాజరు కావాలని గవర్నర్‌కు ఆహ్వాన పత్రికను అందచేసారు. శ్రీ శారదాపీఠం ఆది శంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠంగా విలసిల్లు తుందని, సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం చేపడు తుందని ఈ సందర్భంగా పీఠం ఉత్త‌రాధికారి గవర్నర్‌కు వివరించారు. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా ప్రబోధం చేసే గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోందని, వార్షిక మహోత్సవ వేడుకకు సకుటు-ంబ సమేతంగా విచ్చేసి రాజ శ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని స్వాత్మానం దేంద్ర సరస్వతీ స్వామి గవర్నర్‌ హరిచందన్‌కు సాదర పూర్వక ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసొడియా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement