Thursday, March 28, 2024

చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నం..

చిక్క‌డప‌ల్లిలోని వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌చ్చేయ‌డంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకలలో భాగంగా చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి దేవాలయాన్ని రకరకాల సుగంధ పుష్పాలు, రంగురంగుల విద్యుత్తు దీపాలంకరణతో ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement