Thursday, April 25, 2024

29వ తేదీ నుంచి సమతామూర్తి కేంద్రంలో అభిషేకాలు, ఆరాధనలు

ముచ్చింతల్ : శంషాబాద్‌లోని ముచ్చింత‌ల్‌ శ్రీరామనగరంలో వెలసిన ప్రపంచ ప్రఖ్యాత సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మార్చి 29 నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలు జ‌ర‌గ‌నున్నాయ‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ చినజీయర్‌ స్వామి అన్నారు. దీంతో సందర్శకులకు ఆలయ ప్రవేశం ఉండదు.

  1. మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదు.
  2. ఏప్రిల్‌ 2 అనగ ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం.
  3. సందర్శన సమయం ప్రతి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.
  4. యధావిధిగా ప్రతి బుధవారం సెలవు.
  5. ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు లేదు.
  6. సెల్‌ఫోన్‌, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి నిరాకరణ.
  7. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలి.
  8. పాదరక్షలు బయటే వదలాలి
  9. ఎటువంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదు.
    నిబంధనలు అందరూ పాటిస్తూ సమతామూర్తి స్ఫూర్తికేంద్రం సిబ్బందికి సహకరించాలి చిన్న‌జీయ‌ర్ స్వామి కోరారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement