Friday, April 19, 2024

అద్భుతమైన వరం…బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహో రాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముం దు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూ ర్యోదయం అవడానికి, 98–48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించా రు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూ ర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతి రోజు బ్రహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తా నికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమ యంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడ వుతుంది.
పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విష యంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినత కు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూ హలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సార థిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయ మున ఏ నక్షత్రాలు, గ్రహాలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్హ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబు తోంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపత పాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమ యంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉం టుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరి స్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావా లంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనం దాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసు లు, ఋషులు… హమాలయాలలో ధ్యానంలో ఉం టూ వారి వారి తప:శక్తి తరంగాలను ప్రపంచ మంతా ప్రసరింప చేస్తారు. అందువలన ఆ సమ యంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధి స్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమ యాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుం టారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపో యినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమ యాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణా యామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయం లో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వల న మనసు త్వరగా భగవ ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చు కుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు.
ఎప్పుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురు తుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమవ్వాలి. తద్వారా పరమాత్మను చేరుకునే మార్గాలు ఏర్పడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement