Thursday, April 25, 2024

హనుమంతుడు ఆచార్య పదవికి తగినవాడేనా

పంపా తీరం చేరిన రామచంద్రమూర్తి, అపహరించ బడిన భార్య సీత కోసంబేలవలె ఏడుస్తూ వుండ డం చూసిన లక్ష్మణుడు సమాయనుకూల హత బోధ చేసి సంతాపాన్ని ఉపశమింప చేసే ప్రయత్నం చేశాడు. లక్ష్మ ణుడు చెప్పిన మాటలు సత్యమని భావించిన రాముడు దు:ఖాన్ని విడిచి ధైర్యం వహించాడు. ఆ తరువాత శీఘ్రంగా నిర్భయంగా నడుస్తూ, తమ్ముడు ధర్మ వాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ఋశ్య మూక పర్వతం దిశగా ముందుకు సాగిపోయారు.
రాముడు, లక్ష్మణుడు ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, వారిని, కొండమీద వున్న సుగ్రీవుడు చూసి భయ పడ్డాడు. సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులను చూసిన వానరులకు వీరిని వాలి పంపగా తమ ను చంపడానికి వచ్చారని భావించారు. పంపానదికి ఉత్తరాన రామ లక్ష్మణులు, దక్షిణాన సుగ్రీవాదులు వున్నారు. వారి వెంట ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని నలుదిక్కులా చూశాడు. ఒకచోట నిల్వలేకపోయాడు. పరుగెత్త సాగాడు.
ఆ సమయంలో ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి ”వానర రాజా! ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్య మూకం కదా! ఇక్కడ వాలివల్ల భయం లేదుకదా? ఒకవేళ భయ పడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందు
కు తొట్రుపాటు పడుతున్నావు? నీ పిరికితనానికి కారణం ఏమిటి?” అంటాడు.హితమైన మాటలు చెప్పిన ఆంజనేయుడితో సుగ్రీవుడు రామ లక్ష్మణులను చూసిన విషయం చెప్పి, తనను చంపగల వారెవరినో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను కాబట్టి భయపడ్డానని అంటాడు.
”రాజులందరూ తమ శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు? అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇది ఇలాగే అని నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను వుండడం మంచిదని పరుగెత్తి వచ్చాను. నా ఆలోచన సరైందా? కాదా? అని తెలుసుకోవాలి. దానికొరకు ఎవరో ఒక సామాన్యుడిని వారిదగ్గర
కు పంపాలి. నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ల దగ్గరికి పోయి విషయం తెలుసుకో. ఆంజనేయా!నువ్వు పోయి వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో. నీమీద ముందుగా నమ్మకం పుట్టించుకుని ఆ తరువాత నామీద వాళ్లకు సదభిప్రాయం కలిగేట్లు చేయి. వాళ్లు నిర్మలమైన మనస్సు కలవారనీ, వంచన గుణం లేని వారనీ నీకు నమ్మకం కుదిరితే, వాళ్లు మాట్లాడే విధానం గమ నించు. వారి మాటల్లో నిజమెంతో, మోసమెంతో తెలుసుకో”.
అని సుగ్రీవుడు చెప్పగా #హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి నిజస్వరూపంలో పోతే, పోయిన పని నెరవేర్చడం కష్ట మని భావించి,వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి, వారిదగ్గరికి పోయి ఏకాగ్రచిత్తంతో, వినయం గా వాళ్లకు నమస్కారం చేశాడు. ఇక్కడ సన్న్యాసి రూపం ధరించిన #హనుమంతుడు గ#హస్తుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి ఆచారం సమ ంజసమని అను కోవాలి. సన్న్యాసిగ హస్తుడికి నమస్కారం చేయడం భావ్యం కాద ని కొందరంటారు కాని, అది వాస్తవం కాదు. మనువాక్యమూ కాదు.మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో, కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గ#హస్తుడికి సన్న్యాసి నమస్కరించాలి అనేదే మనువాక్యం. #హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల ఆకారాలు చూసిన వెంటనే అధికానంద పరవశుడై తాను ధరించిన సన్న్యాసి ఆకారాన్ని కూడ మరచిపోయి అవశంగా వారికి నమస్కారం చేశా డు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి అభిప్రాయం. ఇది యుక్తంకాదు. హనుమంతుడు నిపుణమతి. గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం కనుక్కొని రమ్మని సుగ్రీవుడు పంపగా వచ్చా డు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను మరచిపోతే తక్కిన కార్యం ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ము తాడు? రామచంద్ర మూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయిం చిన హనుమంతుడు తాను వేసుకున్న వేషం మారు వేషమనీ, తాను చారుడనీ తెలియ చేయడానికే నమస్కారం చేశాడు. ఇక్కడ బిక్షువు అంటే సన్న్యాసి కాడు. బ్రహ్మచారి అని కొందరంటారు. అదీ యుక్తం కాదు. హనుమంతుడు మొదటినుండీ బ్రహ్మచారే కాని, ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి హనుమంతుడు సన్న్యాసి వేషం ధరించాడనీ, జ్ఞానాధికుడైన రామచంద్రుడికి, గహస్తుడికి, నమస్కరించడం తప్పుకాదనీ చెప్పాలి.
ఆ తరువాత సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా.” అయ్యలారా! మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు రాజర్షులతో, దేవతలతో సమానంగా వున్నారు. మీలో రాజ వేషం , ముని వేషం రెండూ కలిసి వున్నాయి. అలా అయితే మీరు సంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా వున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనడానికి కారణమేంటి? మ#హమలో దేవతలకు సమానంగా వున్నారు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. మీరెందుకు నారచీరెలు కట్టి జడదారుల్లాగా జడలు ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు, మీ ఇప్పటి స్థితి, పరస్పర విరుద్ధంగా వుండడానికి కారణం ఏంటి?. మీరేదో శత్రుసంహార కార్యక్రమానికి సిద్ధమైనట్లు కనపడుతున్నది”.
#హనుమంతుడు ఇన్ని ప్రశ్నలు వేసినా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపుపెంపు వింటూ వూరకే వున్నారు తప్ప ఒక్క దానికైనా జవాబివ్వలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. ఆయన మాటలపట్ల ఆసక్తి కావచ్చు. తాము మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోల్పోవచ్చు. సన్న్యాసులు తిరగకూడని ప్రదేశంలో తిరుగుతున్న ఈ సన్న్యాసి నిజమైన సన్న్యాసా? కాదా? అన్న సందే హం కావచ్చు. బిక్షకోసం వచ్చిన సన్న్యాసి అయితే ఆయన స్థితి గతులు చెప్పుకోవాలి కాని తమ స్థితిగతులను గురించి ఎందుకు అడగాలి? వేగులవాడేమో! ఇక్కడ పరస్పర శత్రువులైన వాలిసుగ్రీ వులలో ఇతడు ఎవరి పక్షమో? కాబట్టి ముందుగా తానెవరో చెప్పి న తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి వుం డాలి. ఇక హనుమంతుడు వేరే విధంగా ఆలోచించసాగాడు. తానెంత మాట్లాడినా వీళ్లు బదులు చెప్పడం లేదు. తనమీద వీరికి సందేహం కలిగిందేమో? ఆ సందేహం తీరేవిధంగా తాను సంభా షిస్తేనేగాని వాళ్లు తనను నమ్మి తనతో మాట్లాడారని అనుకుం టాడు. వీళ్లు గొప్పవారిలాగా వున్నారు కాబట్టి వీళ్ల స్నే#హం తప్పక చేయాలి అని ఆలోచించి తన వృత్తాంతాన్ని కపటం లేకుండా ఇలా చెప్పాడు. ”ఆర్యులారా! నా వృత్తాంతాన్ని చెప్తావినండి. ఈ ప్రాం తంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు, కోతిరాజు, వీరుల గౌరవా నికి పాత్రుడు వున్నాడు. అతడిని ఆయన అన్న వెళ్లగొట్టితే నిలువ నీడలేక, ప్రాణ భయంతో అమితంగా బాధపడ్తూ దేశంలో తిరుగు తున్నాడు. మీ స్నే#హం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపితే మీ దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు #హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషం లో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి హనుమం తుడు మౌనం దాల్చాడు.
దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి సుగ్రీవుడిని వెళ్లగొట్టడం, సుగ్రీవుడు ఋశ్యమూకం మీద వుండడం, ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన విషయమే. కాబట్టి సందేహానికి తావు లేదు. ఆ తరువాత తాను సుగ్రీవుడి మంత్రినని చెప్పాడు #హనుమం తుడు. అంటే సుగ్రీవుడి పక్షంవాడని అర్థమయింది.
#హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు ”లక్ష్మ ణా! ఇతడు సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. మనం ఏ సుగ్రీవు డిని చూడాలని పోతున్నామో, అతడి మంత్రే ఈ రూపంలో మన దగ్గరికి వచ్చాడు. అంటే, సుగ్రీవుడితో ఏ పనైతే అవుతుందని అను కుంటున్నామో, అది ఇతడిద్వారానే జరుగుతుంది. ఆయన్ను మనం ఎలా నమ్మవచ్చో ఇతడిని కూడా అలాగే నమ్మవచ్చు. ఆయ నకూ, ఇతడికీ భేదం లేదు”. #హనుమంతుడు ఆచార్యపదవికి తగిన వాడని శ్రీరామచంద్ర మూర్తి ఆయన యోగ్యతను గురించి చెప్పా డు. ఆచార్యుడు వేదం తెల్సినవాడిగానూ, విష్ణుభక్తుడుగానూ, మాత్సర్యం లేనివాడు గానూ, విష్ణుమంత్రం తెలిసినవాడుగానూ, ఆ మంత్రం మీద భకి ్తకల వాడుగానూ, మంత్రార్థం ఇతరులకు చెప్పగలిగినవాడుగానూ, బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైన వాడుగానూ, గురుభక్తికల వాడుగానూ, పురాణాల జ్ఞానంకల వాడుగానూ వుండాలి. ఇలాంటి వాడినే ఆచార్యడు అంటారు. ఈ గుణాలు హనుమంతుడి లో వున్నాయని శ్రీరాముడు చెప్పాడు లక్ష్మణుడితో. సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని రామచంద్రమూర్తి నిశ్చయించుకు న్నాడు. వాక్య జ్ఞుడు లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని శ్రీరామచంద్రమూర్తి అంటాడు. అంటే, ఈ గుణాలన్నీ లక్ష్మణు డిలో, హనుమంతుడిలో ఇద్దరిలో కలవనీ, ఇద్దరూ సమానులే అనీ భావం. శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పడంతో, వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు వాక్యజ్ఞుడైన హనుమంతుడితో.. ”అయ్యా! పండి తు డా! సుగ్రీవుడి గురించి, అతడి ప్రభావం గురించీ, అతడి గొప్ప గుణాలను గురించీ, మేం ఇదివరకే విన్నాం. కాబట్టే ఆయన్ను వెతు క్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పిన సుగ్రీవుడి పనిని మేం సంతోషంతో నువ్వు చెప్పినట్లే చేయగలం”. ఇది విని హనుమంతు డు సుగ్రీవుడి జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహంకుదర్చా లని అనుకున్నాడు. ఆ తరువాత హనుమంతుడితో తమ యావత్‌ వృత్తాంతాన్ని చెప్పా డు లక్ష్మణుడు. ఆంజనేయుడు తన సన్న్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. రామలక్ష్మణులను ఇద్దరినీ భుజాల మీద ఎక్కించుకుని, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
– వనం
జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement