Thursday, April 25, 2024

సూర్యప్రభ వాహనంపై తేజస్వరూపుడు

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామివారు గోవిందరాజస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. ఇంతటి మహాతేజ:పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్దిస్తాయి. ఈ వాహన సేవలో పెద్దజీయర్‌, చిన్నజీయర్‌ స్వాములు, టిటిడి ఈవో జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
చంద్రప్రభ వాహనంపై రమావల్లభుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఏడో రోజు బుధ వారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మం డపంలో శ్రీమలయప్పస్వామివా రు వటపత్రశాయి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమి చ్చారు. చంద్రుడు శివుడికి శిరోభు షణమైతే ఇక్కడ శ్రీవారికి వాహ నంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనం పై స్వామిని చూడగానే భక్తుల మన సు ఉప్పొంగుతుంది. ఈ వాహన సేవ కార్యక్రమంలో పెద్దజీయర్‌, చిన్నజీయర్‌ స్వాములు, శాసనమండలి ఉప సభాపతి కోనరఘుపతి, టిటిడి ఈవో జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదోరోజు నేడు ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రికి అశ్వ వాహనం పై శ్రీవారు కటాక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement