Friday, March 29, 2024

రికార్డు స్థాయిలో అప్పన్న ఆదాయం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహ స్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఈ మేరకు ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో గురువారం హుండీలు తెరిచి లెక్కించారు. 28 రోజులకు రూ.1,01,29,353 ఆదాయం లభిం చింది. వీటితో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. కోవిడ్‌ అనంతరం సింహాచలం దేవాలయానికి భక్తులు తాకిడి ఘననీయంగా పెరుగుతుంది. ఈ నేపధ్యంలోనే భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో లభిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement