Saturday, April 20, 2024

నడకదారిలో భక్తులకు అనుమతి

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి: శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పైకప్పు పనులు దాదాపు పూర్త య్యాయని, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో కెఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడ కదారి పై కప్పు పనులను బుధవారం ఈవో అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డితో కలసి పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో టీటీడీ చేపట్టిన అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడకదారి పైకప్పు నిర్మాణ పనులు పూర్తయ్యా యన్నారు. తద్వారా భక్తులు నడక మార్గంలో ప్రయాణించడానికి సౌకర్యవం తంగా ఉంటుందని చెప్పారు. భక్తులను అనుమతించిన తర్వాత కూడా ఇక్కడ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పైకప్పు పున: నిర్మాణం సందర్భంగా తొలగించిన కాంక్రీటు వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆ దేశించారు. అంతకు ముందు లక్ష్మీన రసింహస్వామి ఆలయం నుంచి నామాల గోపురం వరకు నిర్మించిన పై కప్పును, మార్గ మధ్యంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 నాగెెశ్వరరెడ్డి, ఎస్టేట్‌ అ ధికారి మల్లికార్జున, ఆరోగ్య విభాగం అధికారి శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement