విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో:“ విశాఖ శారదాపీ ఠాన్ని సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. తొలుత మంత్రిని పీఠం వర్గాలు సాదరంగా స్వాగతించాయి. అ నంతరం పీఠం ప్రాంగణంలో గల దేవతా మూ ర్తులను మంత్రి వెల్లంపల్లి దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మ వారి ఆలయం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరంపీఠాధిపతి స్వరూపానందేంద్రను కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. శరన్నవ రాత్రి ఉత్సవాలు సందర్భంగా విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయానికి విచ్చేయాలని స్వామిజీని మంత్రి ఆహ్వానించారు. దసరా సందర్భంగా అమ్మవారి ఆలయంలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను తెలియజేసి స్వామీజీని స్వాగతించారు. మంత్రితో పాటు శాసనసభ్యులు మల్లాది విష్ణు, కరణంధర్మశ్రీ, మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్బాబు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement