Thursday, April 25, 2024

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాలు ఉత్సవాలు

ఢిల్లిలోని తెలంగాణ భవన్‌లో భోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం జరిగాయి. ఉత్సవంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా బోనాల ఉత్సవాలు నిర్వహించినట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు. బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement