Thursday, April 25, 2024

టీటీడీకి జియో సాంకేతిక సహకారం

టీటీడీ సేవలన్నీ ఒకే యాప్‌లో…టీటీడీ జి యో ఎంవోయూ
తిరుమల, ప్రభన్యూస్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాజిలో టీటీడీకి సహకరించేందుకు జి యా సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన టీటీడీ – జియో శుక్ర వారం ఎంఓయు చేసుకున్నాయి. తిరుమల అన్నమయ్య భవనంలోజరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి జియో ప్రతినిధి అనిష్‌ ఎంవోయూ పై సంతకాలు చేశారు. అనంతరం చైర్మన్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్‌ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారి చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్‌ కోసం ప్రయత్నించారన్నారు. దీ ంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ సమస్యలను అదిగమించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా దర్శన టికెట్లను జారి చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని చైర్మెన్‌ తెలిపారు. గత నెలలో జియో క్లౌడ్‌ టెక్నాలజి ద్వారా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామన్నారు. ఎలాంటి ఇబ్బందిలేకుండా భక్తులు గంటలోపు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ యాప్‌లో భక్తులు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు అందుబాటిలో ఉంటాయని చెప్పారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఆవిష్కరించే ఏర్పాటు చేయాలని చైర్మన్‌ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. గత ఐదేళ్ళుగా టిటిడికి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్‌ సమన్వయంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. జియో సంస్థ ప్రతినిధులు బీసి సింగ్‌, అమర్‌ , దుగ్గల్‌, భారతి, టీటీడీ ఐటి విభాగం ఇన్‌చార్జ్‌ శేషారెడ్డి చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement