Friday, March 29, 2024

ఈశ్వరుని నివాసం ఎలా ఉంటుంది

శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అంద రికీ తెలిసిందే. అయితే ఆ పరమేశ్వరుడు నివ శించే ప్రాంతమంతా ఎంత శోభాయమానంగా ఉంటుంది? పరిసరాలలో ఏమేమి ఉంటాయి? అనే విష యాలతోపాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు? అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథా సందర్భం. ఇది లింగ పురాణం యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఉంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉం టాడు. ఎత్తైన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుం టుంది. భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. సుగంధ భరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్క డక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతో, విస్తరించిన కొమ్మలతో ఉండే వృక్షాలు దట్ట మైన నీడను కల్పిస్తూ ఉంటాయి. దేవదేవుడైన శంకరుడి మందిరం మణి విభూషి తంగానూ, బంగారు మయంగానూ, స్ఫటిక నిర్మితం గానూ ఉన్న గోపురాలతో అలరారుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాస నాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుం టున్న భూతేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి. భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, రుషులు, గంధ ర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోట్లాది మంది యక్షులతో పాటు పుణ్యాత్ములు అనేకమంది నివసిస్తుంటారు. కుబేర శిఖరం నుంచి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధ భరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి.
యక్ష, గంథర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నె రులు ఆ నదిలో ఆనందంగా స్నానపానాలను చేస్తుం టారు. మందాకినీ నదికి ఉత్తర భాగంలోను, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబసదాశివుడు అమ్మవారితో హాయిగా విహరిస్తుంటాడు అని లింగ పురాణం ఇలా శివ నివాస స్థానాన్ని పేర్కొంటోంది. అలాగే ఇంద్రాదుల విషయానికొస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వతం శిఖరం మీద దానవులకు చెందిన ఎనిమిది పురాలు ఉంటాయి. సువర్ణ కోటరాద్రి మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపం లోనే ఉన్న మహనీలాచలం మీద అశ్వ ముఖులైన కిన్నెరుల పదిహేను పురాలు, వేణు సౌదాద్రి మీద విద్యా ధరులు ఉండే మూడు నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరం జాద్రి మీద నీలలో హితరుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్ట వసువుల నివాసాలు, రత్న ధారాద్రి మీద సప్త రుషుల సప్త భవనాలు ఉంటాయి. ఏక శృంగ పర్వతం మీద ప్రజాపతి నివా సం ఉంటుంది. గజ శైలాద్రి మీద దుర్గాదేవి తదితర దేవతల నివాసాలు ఉంటాయి. హమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతల ఆవాసాలు ఉంటాయి. ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో ఎనభై అద్భుతమైన నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద, పంచకుటాద్రి పైన రాక్షసులకు చెందిన అయిదు కోట్ల నివాసాలు ఉంటాయి. శత శృంగ పర్వతం మీద యక్షులకు చెందిన వంద పురాలు, తామ్రా భం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల ఏడు వేల పురాలు, పుష్ప కేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర, వాయు, నాగధికుల నాలుగు నివాసాలు ఉంటాయి. ఇలా సమస్త దేవతలకు చెందిన నివాసాల గురించి పురాణాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement